విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
ఐ.పోలవరం విశ్వం వాయిస్
అనుమతి లేకుండా చెరువులు తవ్వకాలు
యథేచ్ఛగా అక్రమ మట్టిని తరలిస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని స్థానికుల ఆగ్రహం కలెక్టర్ ఆదేశించినా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన
రెచ్చిపోతున్న మట్టి మాఫియా ఆగడాలు
రోడ్లు చిద్రం చేస్తున్నారంటూ ఆగ్రహం
వివరాల్లోకి వెళితే..
ఐ.పోలవరం మండలం కొమరగిరి గ్రామంలో 216 జాతీయ రహదారి పక్కనే ఉన్న పంటపొలాలను నల్ల మట్టితో పూడ్చి పెడుతున్నారు.
దీనిపై రెవిన్యూ అధికారులను వివరణ కోరగా రెవెన్యూ శాఖ నుంచి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ అధిక వేగంతో ట్రాక్టర్ల ను రోడ్డు మీద నడుపుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూన్నారని స్థానికులు వాపోయారు.
కొమరగిరి ప్రాంతానికి చెందిన మట్టి మాఫియా దళారీ కనుసైగలో ఈ అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా జరుగుతుంది. మట్టిని
ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల మట్టిని చుట్టుపక్కల పంటభూములు కప్పెట్టడానికి తరలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో లేఔట్లను చదును చేయడానికి, రోడ్లు వేయడానికి మట్టిని చుట్టుపక్కల గ్రామాల నుంచి వాటి యజమానులు కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదునుగా గ్రామాల్లో స్థానికంగా ఉంటున్న మట్టి మాఫియా దళారులు వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది మట్టి మాఫియా పై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుకుంటున్నారు