Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:

 

ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ :

మండలంలోని తోటపల్లి ప్రధాన రహదారిపై బిజేపి పార్టీ మండల అధ్యక్షుడు మోదుగు పెరమయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లా ప్రసాద్ మాట్లాడుతూ ఎటపాక ఆర్డీవో కార్యాలయంతో పాటు , చింతూరు ఐటిడిఏ పిఓ కార్యాలయాన్ని యధావిధిగా కొనసాగిస్తూ రెగ్యులర్ పిఓను నియమించాలని కోరారు. విలీన మండలాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. విద్యుత్ సమస్యలు , సరైన రహాదారులు లేక , ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు లేక విలీన ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజి, పునరావాసం కల్పించాలని కోరారు. విలీన మండలాల నిర్వాసితులు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో. జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ ఇసంపల్లి శ్రీనివాస్ , పార్టీ సీనియర్ నాయకులు మండల బిసి మోర్చా అధ్యక్షుడు పులుసు రామకృష్ణ , గంధం జయమ్మ , మండల ప్రధాన కార్యదర్శి పేరాల రాజు , ఎస్సి మోర్చా నాయకుడు నాగరాజు , నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement