విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమరావతి:
విజయవాడ ( విశ్వం వాయిస్ న్యూస్ )
విజయవాడ : రాష్ట్రంలో జరుగుతున్న పలు సంఘటనలపై ఆదివారం విజయవాడ రాజ్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు జంగా గౌతమ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజేషన్ ఇంచార్జి రాజీవ్ రతన్, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జి నూతలపాటి రవికాంత్, ఆర్ టీ ఐ చైర్మన్ పి.వై కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
కోనసీమలో ఇటీవల జరిగిన పరిణామాలతో పాటు ఇటీవల జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎంఎల్సీ అనంతబాబు పాత్ర, ప్రశాంతంగా ఉండే పచ్చని కోన సీమ జిల్లాలో అసాంఘిక శక్తుల అరాచకాలు తదితర అంశాలను వారు గవర్నర్ కు వివరించారు.