Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

బిజెపి గోదావరి గర్జన బహిరంగ సభను విజయవంతం చేయండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:

 

ఆలమూరు (విశ్వం వాయిస్ న్యూస్):

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 7వ తేదిన ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే భారతీయ జనతా పార్టీ “గోదావరి గర్జన” బహిరంగ సభను విజయవంతం చేయాలని కొత్తపేట నియోజకవర్గం గోదావరి గర్జన ఇంచార్జ్ ఇళ్ల సత్యనారాయణ, ప్రసార ఇన్చార్జి అయినవిల్లి సత్తిబాబు గౌడ్ అన్నారు. ఆలమూరు మండలం జొన్నాడ గ్రామంలో బుధవారం బహిరంగ సభపై భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా ముఖ్య అతిధిగా పాల్గొనే “గోదావరి గర్జన” బహిరంగ సభకు విస్తారక్ లు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్నారు. బిజెపి నాయకులు, కార్యకర్తలలు అధిక సంఖ్యలో బహిరంగ సభకు వచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడ్డీ దొరబాబు, సీతారామ రెడ్డి, బలుపు శ్రీను పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement