Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పిడుగుపాటుకు ఇంటిలో కరెంటు వైర్లు దగ్ధం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడిన గ్రామస్తులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:

 

ఆత్రేయపురం:విశ్వం వాయిస్:

మండలంలో ర్యాలీ గ్రామం రజక వీధిలో పిడుగు పడింది. ఈ పిరికి ప్రభావంవల్ల ర్యాలీ గ్రామస్తులు ఉలిక్కిపాటు అయ్యారంటే ఆ పిడుగు పడిన చోట ఎంత ప్రభావం ఉంటుందో ఊహించుకుంటేనే భయాందోళన కలిగిస్తుంది. ఈ పిడుగు ప్రభావం రెండు ఇల్లులు మధ్య పడడంతో ఆ కుటుంబ సభ్యులు మరింత భయాందోళనకు గురయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి. రజక వీధిలో నివాసముంటున్న చిట్టూరి సత్యం భార్య గంగ ఇంట్లో ఉండగా ఒక్కసారిగా పెద్ద వెలుగుతో శబ్దం రావడంతో భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ పిడుగు, ప్రహరీ గోడకు ఆనుకుని పడడంతో , ఒక్కసారిగా కిందకు కూర్చుండి పోగా ఇంట్లో ఉన్న కరెంటు వైర్లు భగ్గుమని మంటలు చెలరేగడంతో ప్రాణభయంతో ఆ దంపతులు ఇద్దరూ బయటకు పరుగులు తీశారు.ఆ పిడుగు దాటికి పక్కనే ఉన్న మరో ఇంటిలో కూడా పవర్ సప్లై వైర్లు దెబ్బతిన్నాయి. అయితే ఆ వైర్లు కాలిపోవడం కాకుండా సీలింగ్ ఫ్యాన్లు టీవీలు దెబ్బతిన్నాయని ఆ కుటుంబ సభ్యులు వాపోయారు. అదేవిధంగా సమయానికి కరెంటు కూడా లేకపోవడం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అయితే ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సచివాలయం సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి ఉన్నత అధికారులకు విషయం తెలియపరిచారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement