Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఇంద్రపాలెం ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ రూరల్:

 

కాకినాడ రూరల్  విశ్వం వాయిస్ న్యూస్

ఇంద్రపాలెం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అదనపు తరగతులు గదులు నిర్మాణమునకు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, కాకినాడ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు శంకుస్థాపన చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్ ఎం.టీ.విక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమమునకు ఎమ్మెల్యే కన్నబాబు కొబ్బరికాయ కొట్టి శిలాఫలకం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించిన విధముగా నాడు నేడు 2వ ఫేజ్ నందు ఈ పాఠశాలకు రూ. 92 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలని జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అన్నారు.రూరల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీను మాట్లాడుతూ ఈ పాఠశాల చైర్మన్, ప్రధానోపాధ్యాయురాలు నాగేశ్వరి ఆధ్వర్యంలో విద్యార్థులకు మంచి క్రమశిక్షణ కూడిన నాణ్యమైన విద్య అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ సత్యనారాయణ,జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ,గ్రామ పెద్దలు,అధికారులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement