Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on December 1, 2023 4:36 AM

ACTIVE

India
44,468,646
Total active cases
Updated on December 1, 2023 4:36 AM

DEATHS

India
533,298
Total deaths
Updated on December 1, 2023 4:36 AM
Follow Us

యాదవులు ఐక్యంగా అభివృద్ధి చెందాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:

 

శంఖవరం, జూన్ 12, (విశ్వం వాయిస్ న్యూస్) ;

యాదవులు అందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా కలిసికట్టుగా ఉండి, అభివృద్ధి సాధించాలని తుని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి యనమల కృష్ణుడు పిలుపును ఇచ్చారు. మనమందరం కలిసి కట్టుగా ఉంటేనే ఏమైనా సాధించగలమని, మీ పిల్లల్ని బాగా చదివించి విద్యావంతులు చేయాలని ఆయన కోరారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతంపేటలో కనకదుర్గ గుడి ప్రాంగణంలోని ప్రభుత్వ యాదవ సామాజిక భవనంలో యాదవుల ఆత్మీయ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరు అయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా యాదవులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

అనంతరం కాకినాడ జిల్లా యాదవ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మాసమేను గంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొయ్యా బాబూరావు, కోశాధికారి పక్కుర్తి మహేష్, మహిళా అధ్యక్షురాలు, యూత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, ప్రచార కార్యదర్శిలు కూడా ఎన్నిక అయ్యారు. నూతన కార్యవర్గం సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ ఈఓల సంఘము అదయక్షుడు చందక దొరబాబు, సర్పంచులు, ఎంపిటిసిలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పెద్దలు, యువత తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!