విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, బి ఆర్ పురం:
వి.అర్.పురం,( విశ్వం వాయిస్ న్యూస్) 12;-
ప్రస్తుతం రాష్ట్రంలో వైసిపి పాలన అస్త వ్యస్థంగా ఉందని, ఆ పార్టీని గద్దె ధించాలనే ఉద్దేశ్యంతో ప్రజా సమస్యలపై సిపియం పార్టీ ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని తల పెట్టింది. అందు కోసం జనం కోసం సిపిఎం అనే కార్యక్రమంలో భాగంగా ఆదివారం వి.ఆర్.పురం మండలం లోని ములకలపల్లి పంచాయతీలో సిపిఎం బృందం ఇంటింటికి తిరిగి సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా త్రాగునీటి సమస్య. అమ్మ ఒడి పథకం. రైతు భరోసా వంటి బస్సు ఛార్జీలు నిత్యవసర వస్తువులు పెరుగుదల అనేక సమస్యలను ప్రజలు బృందానికి తెలియపరిచారు. ముఖ్యంగా విద్యుత్ చార్జీలు పెరిగి సామాన్యులకు భారంగా మారాయని. అమ్మ ఒడి పథకం లో అనేక మందికి లబ్ధి చేకూరే లేదని ప్రజల సమస్యలను తెలియజేశారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేవలం ప్రచారానికి పరిమితమైన రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను కనబరిచారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు సోయం చిన్న బాబు సర్పంచ్ సవరం మారయ్య పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు