Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,162,832
Total recovered
Updated on March 25, 2023 12:59 PM

ACTIVE

India
8,601
Total active cases
Updated on March 25, 2023 12:59 PM

DEATHS

India
530,824
Total deaths
Updated on March 25, 2023 12:59 PM

జగన్ పాలనలో దళితులపై దాడులు పెరిగాయి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:

 

ముమ్మిడివరం విశ్వం వాయిస్ రిపోర్టర్,

జగన్ రెడ్డి పాలనలో దళితులపై దాడులు పెరుగుపోయాయని..అరికట్టడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగుదేశం పార్టీ ఎస్.సి.సెల్ రాష్ట్ర అదికార ప్రతినిధి చెల్లి అశోక్ విమర్శించారు. ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దళితుల ఓట్లు తో గద్దెనెక్కిన ప్రభుత్వం నిత్యం దళితులను మోసంచేస్తూ పాలన సాగిస్తుందన్నారు.గుంటూరు జిల్లాలో తాజాగా దళితమహిళ వెంకాయమ్మ కుటుంబాన్ని వేదింపులకు గురిచేయడం,దౌర్జనానికి దిగడం దళితులపై వైసీపీ నాయకులకు ఉన్న చులకన భావాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చిందన్నారు.ఇప్పటికే దళితులకు అందవలసిన సబ్ ప్లాన్ నిదులు దారిమల్లించడం,దళిత కార్పోరేషన్ నిర్వీర్యం చేయడమేగాక వరుసగా దళితులపై దాడులకు దిగుతూ దళితవంచనకు పాల్పడుతుందని విమర్శించారు. ప్రభుత్వ తీరు ఇలా కొనసాగితే పెద్ద ఎత్తున ప్రతి గటనకు దళితులు దిగే రోజులు దగ్గర లోనే ఉందన్నారు.

జిల్లా టిడిపి ఎస్.సి.సెల్ అధ్యక్షులు పొద్దోకు నారాయణరావు మాట్లాడుతూ దళితులపై వరుసగా జరుగుతున్న దాడులు దళిత సమాజం గమనిస్తుందని త్వరలోనే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ గొల్లకోటి దొరబాబు, కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, ముమ్మిడివరం నగర ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ గొల్లపల్లి గోపి, ముమ్మిడివరం నగర మహిళా అధ్యక్షురాలు మేండి కమల, తోత్తర మోడీ జ్యోతి బాబు, కాశి మూర్తి, మొదలగు వారు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!