Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

బీటెక్ ఫైనల్ విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సభ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:

 

ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ :

మండల పరిధిలోని మేడువాయి గ్రామంలో డా.పాల్ రాజ్ ఇంజినీరింగ్ కళాశాలలో 2018 బ్యాచ్ బిటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కళాశాలలో వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ వరలక్ష్మి విజయవంతంగా బిటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని , మంచి ఉద్యోగాలలో స్థిరపడి ,తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చి సమాజానికి , దేశానికి మంచిపేరు తీసుకురావాలని కోరారు. కళాశాల సెక్రెటరీ జకరయ్య మాట్లాడుతూ ప్రతీ ముగింపు మరొక ఆరంభానికి పునాది అని , ఇక్కడ నేర్చుకున్న విద్య , క్రమశిక్షణ కొనసాగిస్తే సాధించలేనిదంటూ ఏమి ఉండదన్నారు. ఇక్కడ చదువుకున్న వారు ఉన్నత స్థాయిలో ఉన్నారని వారిని ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ఆ స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కళాశాల స్థాపించి 25 వసంతాలు పూర్తి అయినట్లు 22 బ్యాచ్ ల్లో ఇక్కడ విద్యను అభ్యసించినవారు దేశ , విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. ఈ కార్యక్రమంలో శ్యామలారాణి , విక్టోరియా , రాజశేఖర్ , రామకోటి , రవికుమార్ , రమేష్ , కళాశాల సిబ్బంది , విద్యార్థులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement