Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కామ్రేడ్ కాశీకి నివాళులర్పించిన సిపిఎం పార్టీ నాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, చింతూరు:

 

చింతూరు – విశ్వం వాయిస్ న్యూస్

21-06-2022

చింతూరు మండలం గొడ్ల గూడెం గ్రామ మాజీ శాఖ కార్యదర్శి కామ్రేడ్స్ సి కాశి రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహానికి సిపిఎం చింతూరు సీనియర్ నాయకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యుడు పల్లపు వెంకట్, మండల నాయకులు మనకం చిన్నయ్య, పొడియం లక్ష్మణ్, గొడ్లగూడెం లక్కవరం, తులసి పాక గ్రామ ప్రజలు నివాళులర్పించారు. కాశీ మృతదేహంపై సిపిఎం జెండా కప్పి నివాళులర్పించారు. అంతిమయాత్రలో పాల్గొని జోహార్ కాశి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మడకం చిన్నయ్య అధ్యక్షతన జరిగిన సంతాప సభ లో సిపిఎం సీనియర్ నాయకులు యర్రంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ కామ్రేడ్ కాశీ గారు తమిళనాడు ప్రాంతం నుండి చింతూరు మండలానికి వచ్చి గొడ్లగూడెం లో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు అన్నారు. కామ్రేడ్ బత్తుల భీష్మా రావు కామ్రేడ్, మడకం వెంకయ్యల సహచరత్వం తో ఆనాడు సిపిఎం పార్టీ చేసే పోరాటాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాడు వెదురు, తునికాకు పార్టీ చేసే అనేక పోరాటాలలో స్వయంగా పాల్గొన్నాడు. వికలాంగుడైన ఈయనా ఆనాడు ఉద్యమ పథంలో తన వైకల్యాన్ని లెక్క చేయకుండా పని చేశారు, కిలోమీటర్ల తరబడి మామూలు మనుషుల తో సమానంగా నడిచే వారని అన్నారు .కాశీ భార్య సిపిఎం కార్యకర్తలను నాయకులను ఎంతో ఆప్యాయంగా ఆదరించి ఆతిథ్యం ఇచ్చి పంపేవారు. ఆ విధంగా కామ్రేడ్ కాశీ పార్టీ సభ్యుడిగా శాఖ, కార్యదర్శిగా పని చేశారు. రెండు సంవత్సరాల క్రితం చేదోడు, వాదోడుగా ఉండే భార్య చనిపోవడంతో మానసికంగా కొంత క్రుంగి పోయారు గత సంవత్సర కాలంగా ఆనారోగ్యం తో బాధపడుతూ రాత్రి మృతి చెందారు.

అందువలన

గొడ్లగూడెం ,లక్కవరం గ్రామ పటేళ్లు, పూజారులు మరియు గ్రామ శాఖ కార్యదర్శి పూసం వీరయ్య, కట్టం సింగయ్య సత్తిబాబు, రవి రమేష్, రాంబాబు వార్డు మెంబర్లు మూడు గ్రామాల ప్రజలు పాల్గొనీ కామ్రేడ్ కాశీ కి అంతిమ నివాళులు అర్పించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement