Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కంటి చూపు పరిరక్షణకు లయన్స్ కృషి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ, విశ్వం వాయిస్ః

ప్రతి వ్యక్తికి కంటి చూపు ఎంతో ముఖ్యమని దాని పరిరక్షణకు లయన్స్ క్లబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుందని లయన్స్ గవర్నర్ ఎం. విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీ లో లయన్స్ క్లబ్ కాకినాడ సిటీ ఆధ్వర్యంలో గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. విశ్వేశ్వరరావు మాట్లాడుతూ పేద కుటుంబాలకు చెందిన వృద్ధులకు కంటి సమస్యలు ఉన్నా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిర్లక్ష్యం చేస్తున్నారని దీనివలన మొత్తం కంటి చూపు పోయే ప్రమాదం ఉందన్నారు .దీని నివారణకు గాను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో వృద్ధులకు ఉచితంగా క్యాటరాక్ట్ శస్త్ర చికిత్సలు చేయిస్తున్నట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ కాకినాడ సిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని విశ్వేశ్వరరావు తెలిపారు. క్లబ్ అధ్యక్షులు అల్లం వెంకట ధన మెంటా రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డాక్టర్ చంద్ర గుప్త ,రవిశంకర్ పట్నాయక్, కె .మునిరెడ్డి, సుమా పట్నాయక్ , అడబాల రత్న ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement