విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, జొన్నాడ:
ఆలమూరు( విశ్వం వాయిస్ న్యూస్):
మండలం పరిధిలో జొన్నాడ గ్రామంలో కొలువైయున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి వారి ఆలయంలో గురువారం ద్వారంపూడి నాగేంద్ర సత్యనారాయణ రెడ్డి (దొరబాబు), పద్మ దంపతులచే గరుడ ప్రతిష్ట, హోమం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రధాన అర్చక స్వాములు పివి సత్యనారాయణ మూర్తి, పి సాయి కృష్ణ ఆధ్వర్యంలో వేద పండితుల మధ్య భక్తిశ్రద్ధలతో తెల్లవారుజాము నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.