Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,160,997
Total recovered
Updated on March 24, 2023 5:18 AM

ACTIVE

India
7,605
Total active cases
Updated on March 24, 2023 5:18 AM

DEATHS

India
530,816
Total deaths
Updated on March 24, 2023 5:18 AM

రవాణా శాఖ మంత్రి కి ఘనస్వాగతం పలికిన పాలగుమ్మి ప్రజలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

*రవాణా శాఖ మంత్రి కి ఘన స్వాగతం పలికిన పాలగుమ్మి ప్రజలు*

 

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో

 

 

అమలాపురం రూరల్ విశ్వం వాయిస్ ఫిబ్రవరి 1,:

 

రాష్ట్ర ప్రభుత్వం పేద వర్గాల సర్వతోముఖాభివృద్ధికి పలు సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాలు పేరిట ప్రవేశపెట్టిందని వాటిని లక్ష్యత వర్గాల వారు అంది పుచ్చుకొని జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు బుధవారం స్థానిక గ్రామీణ పరిధిలోని పాల గుమ్మి రేవులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట ఇంటింటికి తిరిగి లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించి సంక్షేమ పథకాల లబ్ధి ఏ మేరకు చేకూరింది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వ్యక్తిగత సామాజిక సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. వాటిలో కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గాలు అధికారుల ద్వారా చూపారు. వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం ద్వారా రి సర్వే అనంతరం భూ హక్కు పత్రాలను ఆయన భూ యజమా నులకు పంపిణీ చేశారు. గడపగడపకి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం లక్షిత వర్గాలకు చెందిన పేద ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిని వివరించి ఇంకా సంక్షేమ పథకాలకు అర్హత ఉండి లబ్దిని పొందని వారు వెంటనే గ్రామ సచివాలయం సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు సొంత స్థలం ఉన్న వారికి గృహ నిర్మాణ రుణాలు మంజూరు చేయాలని తదితర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పేదల కష్టాలను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేస్తు అవినీతికి వివక్షతకు తావులేకుండా సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు చేరుతున్నాయని వాటిని అందుపుచ్చుకోవాలని ఆయన లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. నవరత్నాల పథకాల ద్వారా చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన ప్రతీ హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తూ చిత్తశుద్ధిని చాటుకుంటున్నారన్నా రు

 

.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పి శ్రీహరి రాంగోపాల్, సర్పంచ్ కుడుపూడి రామలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆదినారాయణ కే చంద్రమోహన్ ఇతర ప్రజా ప్రతి నిధులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!