తాళ్ళరేవు పరీక్ష కేంద్రం వద్ద ప్రయాణం కొరకు విద్యార్థులు ఇబ్బందులు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
పదవ తరగతి విద్యార్థుల పాట్లు
పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పాట్లు తప్పడం లేదని విద్యార్థిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు బస్సు ప్రయాణం ఉచితం అని ప్రకటించిన ప్రభుత్వం కార్యరూపంలో లేదని తాళ్ళరేవు జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద బస్సు విద్యార్థుల కొరకు ఆఫ్ చేయడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తాళ్ళరేవు పరీక్ష కేంద్రం వద్ద ఆర్టీసీ బస్సు ఆపలేనందువల్ల విద్యార్థులు మండుటెండలో నిలిచిపోయారు. ఒకవేళ బస్సు ఆపిన ఒకరిద్దరిని మాత్రమే ఎక్కించుకొని వెళ్ళిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులలో ఉందని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఏపీఎస్ఆర్టీసీ వారు బస్సును పరీక్షా కేంద్రాల వద్ద హ్యాపీ విద్యార్థుల నిఖించుకోవాలని విద్యార్థుల మనవి అని కొందరు విద్యార్థులు తెలిపారు.