తాళ్లరేవు జార్జి పేటలో
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తాళ్ళరేవు మండలంలోని జార్జి పేట గ్రామంలో ఉన్న వేణుగోపాలస్వామి గుడి వద్ద రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల కొరకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని, అందులో భాగంగా ఈరోజు ప్రారంభించిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పేద ప్రజలకు, తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి పొన్నాడ ముఖ్య అతిథిగా హాజరై 104 వాహనాన్ని ప్రారంభించారు. వైద్య చరిత్రలో అలాగే దేశ చరిత్రలో కూడా ఇది మన పురాని రోజు అని ఎమ్మెల్యే అన్నారు. దేశంలో ఎక్కడా కూడా సంచార వైద్య శిబిరం లేదని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తాళ్ళరేవు వైసిపి నాయకులు, ఎంపీపీ రాయుడు సునీత, జనార్దన్ రావు, జడ్పిటిసి సాగర్ పాల్గొన్నారు.