విశ్వంవాయిస్ న్యూస్, ఒంగోలు:
ప్రకాశం జిల్లా, ఒంగోలు నగరంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమానికి మాజీ మంత్రి, వైసిపి రీజనల్ కోఆర్డినేటర్, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు.
ముందుగా ఆలయ పూజారులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి దంపతులకు సాధర స్వాగతం పలికారు, ఆ తర్వాత ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.