—- సర్పంచ్ అడబాల తాతకాపు
విశ్వంవాయిస్ న్యూస్, మామిడికుదురు:
మండల పరిధిలోని లూటుకుర్రు గ్రామంలో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు, లూటుకుర్రు సర్పంచ్ అడబాల తాతకాపు అన్నారు. గ్రామ పరిధిలో 2, 6 వార్డుల నడుమ నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్ నిర్మాణ పనులను ఆయన మంగళవారం పరిశీలించారు. మండల పరిషత్, పంచాయతీ నిధులు రూ.4 లక్షలతో ఈ సిసి రోడ్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు, పంచాయతీ వార్డు సభ్యులు బోనం కొండ, రొక్కం తేజేశ్వరరావు, పాల్గొన్నారు.