WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

అప్పనపల్లిలో గోదారమ్మ శాంతించు అంటూ పూజలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయం సమీపంలో ఉన్న పుష్కర ఘాట్ వద్ద ఆలయ అధికారులు ,సిబ్బంది, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.వైనతేయ నదీ తీరాన ఉన్న అప్పనపల్లిలో గోదావరి వరద పెరుగుతున్న కారణంగా గోదావరి తీరం వద్ద గోదావరి మాతకు (దేవస్థాన స్నానఘాట్) వద్ద విశేష పూజా కార్యక్రమం జరిపించారు శాంతి పూజ, చీర, సారె సమర్పించి ఇకనైనా శాంతించు గోదారమ్మ అంటూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమములో ఆలయ చైర్మన్ చిట్టూరి రామకృష్ణ ధర్మకర్తల మండలి సభ్యులు చిట్టాల సత్తిబాబు ,గూటం శ్రీనివాస్,కొమ్ముల సూరిబాబు ,ఆలయ ఉప ప్రధాన అర్చకులు మద్దాలి తిరుమల శింగరాచార్యులు , వేదపండితులు జోష్యుల సోమయాజులు , ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారని ఆలయ కార్యనిర్వహణాధికారిణి జి. మాధవి తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement