—- ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు ప్రతీ ఏడాది పురస్కారాలు అందజేత
—– పీ.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు.
విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
మామిడికుదురు లోని డా.బి.ఆర్ అంబేద్కర్ భవన్ లో రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 2022-2023 విద్యా సంవత్సరంలో ప్రతిభ చూపిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఎమ్మెల్యే చిట్టిబాబు చేతులమీదుగా అందజేశారు. ఈ సంక్షేమ సంఘం సమావేశానికి మండల శాఖ అధ్యక్షుడు భూపతి మనోహర్రాజు అధ్యక్షత వహించగా, ఇంటర్ మరియు పదవ తరగతిలో మండల మరియు గ్రామ స్థాయిలో ప్రతిభ చూపిన వారికి, ప్రథమ స్థానం సాధించిన విద్యార్థులకు మొమెంటోలు, నగదు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే చిట్టిబాబు మాట్లాడుతూ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం అందిస్తున్న సేవలు ప్రశంసనీయమైనవన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించే దిశగా సంక్షేమ సంఘం ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రతిభా పురస్కారాలు అందించడం చాలా గొప్ప విషయమని అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని చిట్టిబాబు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సి విభాగంలో మొదటి బహుమతిని అందుకున్న నీతిపూడి అనూష తండ్రి అబ్రహం మాట్లాడుతూ….. విద్యార్థులకు సంక్షేమ సంఘాలు అందిస్తున్న సహాయం ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకునేలా వారిలో చైతన్యం తీసుకొస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బత్తుల నకుల రాజు, సిడిపిఒ ఎడ్ల విజయశ్రీ, రిటైర్డ్ ఎంఈఓ నీతిపూడి చంద్ర రావు, గోసం గి బంగార్రాజు, పెయ్యల వీరభద్రరావు, భత్తుల రమేష్ బాబు, భయ్యా మోహనరావు, సాధనాల సత్యనారాయణ, సంఘం ప్రధాన కార్యదర్శి కారుపల్లి కళ్యాణ్ బాబు, కోశాధికారి నేల శ్రీనివాసరావు పాల్గొన్నారు.