WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

వరద బాధితులకు బియ్యం వితరణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అయ్వప్ప కాలనీ వరద బాధితులకు బియ్యం వితరణ
– ఖమ్మం ఏఎస్పీ రామోజీ రమేష్ చేతుల మీదుగా
– చంద్రోదయ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, భద్రాచలం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వరదల కారణంగా నీటమునిగిన అయ్యప్ప కాలనీలో నివసిస్తున్న 200 కుటుంబాలకు ఎస్.కె.టి గ్రూప్ చైర్మన్ దోసపాటి విశ్వేశ్వరరావు సహాయంతో చంద్రోదయ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వారు ఇంటికి 5 కేజీల బియ్యం వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఖమ్మం ఏఎస్పీ రామోజీ రమేష్ పాల్గోని తన చేతుల మీదగా వరద బాధితులకు బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రామోజీ రమేష్ మాట్లాడుతూ అకస్మాత్తుగా వచ్చిన గోదావరి వరదలకు ఎంతో మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారని పేర్కోన్నారు. ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు తోటి వారి పట్ల మానవతా దృక్పథంతో సహకరించాలన్నారు. అనంతరం ఎస్.కె.టి గ్రూప్ వారిని , చంద్రోదయ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో చంద్రోదయ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ఇసంపల్లి లక్ష్మీ , ట్రెజరర్ పూజారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement