– ఖమ్మం ఏఎస్పీ రామోజీ రమేష్ చేతుల మీదుగా
– చంద్రోదయ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, భద్రాచలం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వరదల కారణంగా నీటమునిగిన అయ్యప్ప కాలనీలో నివసిస్తున్న 200 కుటుంబాలకు ఎస్.కె.టి గ్రూప్ చైర్మన్ దోసపాటి విశ్వేశ్వరరావు సహాయంతో చంద్రోదయ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వారు ఇంటికి 5 కేజీల బియ్యం వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఖమ్మం ఏఎస్పీ రామోజీ రమేష్ పాల్గోని తన చేతుల మీదగా వరద బాధితులకు బియ్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రామోజీ రమేష్ మాట్లాడుతూ అకస్మాత్తుగా వచ్చిన గోదావరి వరదలకు ఎంతో మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారని పేర్కోన్నారు. ఇటువంటి విపత్తులు సంభవించినప్పుడు తోటి వారి పట్ల మానవతా దృక్పథంతో సహకరించాలన్నారు. అనంతరం ఎస్.కె.టి గ్రూప్ వారిని , చంద్రోదయ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో చంద్రోదయ సోషల్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ఇసంపల్లి లక్ష్మీ , ట్రెజరర్ పూజారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.