– జిల్లా కలెక్టర్ మాధవీలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
నిడదవోలు నియోజకవర్గ స్థాయి స్పందన .. కలెక్టర్ కార్యక్రమం అనంతరం నిడదవోలు శాసనసభ్యులు జీ. శ్రీనివాస్ నాయుడు, డా. కే.మాధవీలత లు నిడదవోలు శివారు లో 50 ఎకరాల స్థలంలో ఆటో నగర్ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం లో నిడదవోలు- చాగల్లు ప్రధాన రహదారి మార్గంలో ఆటో నగర్ ఏర్పాటు వలన ఎందరికో ఉపాధి అవకాశాలు కలగటం తో పాటు నిడదవోలు లో ట్రాఫిక్ సమస్య కి పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో లారీ స్టాండ్ కూడా అందుబాటులో ఉందని ఆయన వివరించారు. ఈ సందర్భంలో కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ సిహేచ్. శ్రీధర్, ఆర్డీవో ఎస్.మల్లిబాబు , తహాసీల్ధార్ ఎమ్. గంగరాజు తదితులున్నారు.