పిలుపునిచ్చిన తెలుగుదేశం నాయకులు***
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లారేవు మండలంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటన జరుగుతున్న నేపథ్యంలో పనులను తెలుగుదేశం నాయకులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ లో వైస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర ని అంధకారంలో కి నెట్టేసిందని శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు బాబు పాల్గొని బాదుడే బాదుడు సభ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పర్యటన ప్రదేశాన్ని పరిశీలించిన అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ గంటి హరీష్ మధుర్, తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల జగ్గయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు సమనస గ్రామ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్ ,లింగోలు పెద్దకాపు,భూపతిరాజు లవవర్మ, నిమ్మకాయల సీతయ్య నాయుడు తదితరులు పాల్గోన్నారు