విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరాపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్)అభివృద్ధికీ ఆటంగం కల్పిస్తున్న అధికార వైసీపీ వార్డు సభ్యులు కాలేరు సర్పంచ్ ధాయం కావేరి శేఖరబాబు ఆవేదన. కపిలేశ్వరపురం మండలం కాలేరు గ్రామంలో 10 మంది వార్డు సభ్యులుకు వైసిపి తరుఫున 8 మంది సభ్యులు గెలవడంతో అభివృద్ధికి సహకరించుట లేదని సర్పంచ్ దాయం కావేరి ఆవేదన వ్యక్తంచేశారు.పంచాయితి కార్యాలయం లో సర్పంచ్ దాయం కావేరి, వార్డు సభ్యు డు నాతి చంద్ర శేఖర్ తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. 15 వ, ఆర్థిక సంఘం నిధులు 16 లక్షలు నిల్వవున్నాయని, 4లక్షలు డ్రెయినేజీ కి ఖర్చు చేయుటకు గ్రామ సభలో ఆమోదం పొందిన పనులు ప్రారంభించుట కు అదికారులు సహకరించు ట లేదని సర్పంచ్ వాపోయారు.