సర్పంచ్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆలమూరు:
ఆలమూరు (విశ్వం వాయిస్ న్యూస్): మండలంలోని గుమ్మిలేరులో 1 వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ గుణ్ణం రాంబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 3 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో గుమ్మిలేరు గ్రామంలో పూర్తిస్థాయిలో ప్రతి వార్డు లోనూ సిసి రోడ్లు ఉన్నాయన్నారు. ప్రభుత్వం అలాగే గ్రామంలో పలువురు సహకారంతో గుమ్మిలేరు గ్రామం అభివృద్ధిలో నెంబర్ వన్ గా ఉందని ఆయన అన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరించిన అధికారులకు ఆయన పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా శక్తివంచన లేకుండా సర్పంచ్ రాంబాబు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆ గ్రామ ప్రజలు హర్షంవ్యక్తం చేస్తున్నారు.