విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ గ్రామీణ,విశ్వం వాయిస్ః
సకల లోకాలకు వస్త్ర దానం తో మానవ మాన ప్రాణాలను కాపాడిన రుషి శ్రేష్టుడు భావనారుషి అని ఈయన శ్రీమన్నారాయణ అంశగా భక్తులు కొలుస్తారని కృష్ణమాచార్యులు పేర్కొన్నారు. గురువారం సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో భావన రుషి జయంతి జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ జన్మత: సకల శాస్త్ర ప్రవీణుడు భావన రుషి అని అన్నారు. కాలువాసురుడు అనే రాక్షసుని సంహారం చేయడమే గాక నగ్నత్వాన్ని చేదించిన వాడై వస్త్ర సృష్టి చేసి సకల లోకాలకు ఆయన పూజ్యుడు అయినాడు అని కృష్ణమాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాజా, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.