విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ గ్రామీణం, విశ్వం వాయిస్ః
సమాజ ప్రగతికి పునాది అయిన బాలికల హక్కులను హరించకుండా పూర్తి రక్షణ కల్పించాలని న్యాయవాది శ్రీలక్ష్మి పేర్కొన్నారు. గురువారం రమణయ్యపేట బర్మా కాలనీ అంగన్వాడీ కేంద్రంలో మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సు ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ కుమారులతో సమానంగా కుమార్తెలను పెంచే వ్యక్తిత్వం ప్రతి తల్లిదండ్రులలో రావాలన్నారు. సరైన స్ఫూర్తితో, భవిష్యత్తు పట్ల సానుకూల దృక్పథంతో ఎదగడానికి తగిన వాతావరణం కల్పించాలన్నారు. బాల్య వివాహాలు తగదని, బ్రుణ హత్యలు నివారించాలని అన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించాలని శ్రీలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాజా, పరంజ్యోతి, కాలనీవాసులు పాల్గొన్నారు.