WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

“నేను సైతం” నాగార్జున సేవలను అభినందనీయం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– డివిజన్ లెవెల్ క్రికెట్ టోర్నీలో విజేతకు మెమెంటో అందజేత

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:

 

ఎటపాక , విశ్వం వాయిస్ న్యూస్ :

నేను సైతం స్వచ్చంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి , ప్రముఖ పాత్రికేయులు బుడిపిటి నాగార్జున సేవలు అభినందనీయమని పలువురు ప్రశంసించారు. ఎటపాక మండల కేంద్రంలో జరుగుతున్న డివిజన్ లెవల్ క్రికెట్ టోర్నీలో విజేతకు మెమెంటో అందజేశారు. 22వ మదర్ థెరిస్సా మెగా డివిజన్ లెవల్ క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మొదటి మ్యాచ్ లో తాటాకులగూడెం జట్టు మరియు సందీప్ ఎలెవన్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన తాటాకులగూడెం జట్టు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన సందీప్ ఎలెవన్ జట్టు నిర్నీత 8 ఓవర్లలో 54 పరుగులు చేసింది. 55 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన తాటాకులగూడెం జట్టు టార్గెట్ ను 6.2 ఓవర్లలో సాధించింది. జట్టులో 28 పరుగులు చేసి 2 వికెట్లు తీసిన గోపికి మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ అవార్డును ప్రముఖ పాత్రికేయులు నేను సైతం స్వచ్చంద సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి బుడిపిటి నాగార్జున చేతుల మీదుగా ఆర్గనైజింగ్ కమిటీ అందజేసింది. ఈ కార్యక్రమంలో మధర్ థెరిస్సా క్రికెట్ ఆర్గనైజింగ్ కమిటీ ఫౌండర్ కురినాల వెంకట్ (బుజ్జి), దాసరి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement