విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కపిలేశ్వరపురం:
కపిలేశ్వరపురం మండలం (విశ్వం వాయిస్ )
మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామం లో గల శాఖా గ్రంధాలయం లో వేసవి విజ్ఞాన శిభిరం నిర్వహిస్తున్నట్లు లైబ్రేరియన్ దానేటి శివ కుమారి తెలిపారు. ఈ నెల 17 వ, తేదీ నుండి వచ్చే నెల జూన్ 30 వరకు ఈ వేసవి విజ్ఞాన శిభిరం నిర్వహిస్తామని తెలియచేశారు. ప్రతి రోజూ ఉదయం 8 నుండి12 గంటలు వరకూ శిభిరం జరుగుతుందని, ఆమె చెప్పారు. ఈ శిక్షణ శిబిరంలో విద్యార్దులు కు కథలు చదివించడం,వినిపించడం, డ్రాయింగ్, పేపర్ క్రాఫ్ట్ ల పై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. పుస్తక పఠనం పై విద్యార్దులకు ఆసక్తి కల్పిస్తున్నట్లు శివ కుమారి తెలిపారు.విద్యార్దులకు మంచి నీరు సదుపాయం తో పాటు స్నాక్స్ ఇస్తున్నట్లు లైబ్రేరియన్ శివ కుమారి తెలిపారు.