విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మండపేట:
మండపేట అర్బన్ (విశ్వం వాయిస్ )
గుడ్ ఫ్రైడే సందర్భంగా డ్రాయింగ్ మాస్టర్ అర్తమురు గ్రామానికి చెందిన మందపల్లి సత్యనందం సూచన ఏడిద గ్రామానికి చెందిన పైడిమల్ల రాజు అనే విద్యార్థి 24 గంటల్లోసుమారు 300 క్రీస్తు బొమ్మలు గీసి అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. గత ఏప్రియల్ 12 వ, తేదీ ఉదయం నుండి మర్నాడు ఉదయం వరకూ 24 గంటలూ విరామం లేకుండా స్కెచ్ పెన్ లు, ఆయిల్ పేస్టు లు ఉపయోగించి రాజు ఈ ఘనత సాధించారు. ఇతని చాతుర్యం నకు మెచ్చి హైదరాబాద్ కు చెందిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డు , యు ఎస్ స్ కు చెందిన హెరెంజే ప్రపంచ రికార్డు, మేజిక్ బుక్ ఆఫ్ రికార్డు, ఇండియా రికార్డు లవారు అతనకి కొరియర్ ద్వారా ప్రశంసా పత్రాలు,బహుమతులు అందజేశారు. ఇతని కళా నైపుణ్యాన్ని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మండపేట మున్సిపల్ చైర్ పర్సన్ పతి వాడ నూక దుర్గా రాణి, వైసీపీ నాయకులు కర్రి పాపారాయుడు, దూలం వెంకన్న బాబు, ఏడిద సర్పంచ్ బూరిగ ఆశీర్వాదం, పలివెల సుధాకర్, రిటైర్డు టీచర్ పై డిమల్ల బ్రహ్మయ్య, డ్రాయింగ్ టీచర్, మందపల్లి సత్యాన0 దం అతని బంధువులు, స్నేహితులు అతనిని కలసి అభినందించారు. ప్రస్తుతం రాజు మండపేట గవర్న్ మెంట్ జూనియర్ కాలేజి లో ఇంటర్ ద్వితీయ సంవత్సర చదువు చున్నాడు.