– మొక్కలు నాటిన మేయర్ కమిషనర్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్:
స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు చేపట్టిన జగనన్న హరిత నగరం కార్యక్రమంలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యులు కావాలని నగరపాలక సంస్థ మేయర్ సుంకర శివప్రసన్నసాగర్ పిలుపునిచ్చారు. స్థానిక 40వ డివిజన్ శేషసాయి వీధిలో జగనన్న హరితనగరం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మేయర్ సుంకర శివప్రసన్న ప్రారంభించారు. కమిషనర్ కె.రమేష్, డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్కుమార్, కార్పొరేటర్లు, అధికారుల సమక్షంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రూ.1.72 కోట్ల వ్యయంతో కాకినాడ సుందరీకరణకు శ్రీకారం చుట్టామన్నారు. సెంటర్ డివైడర్లలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటి సంరక్షించే దిశగా అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ కె.రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలోని రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందుకోసం కార్పొరేషన్ సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘ నిధులతోపాటు, పారిశ్రామిక సంస్థల సీఎస్ఆర్ నిధులను కూడా వెచ్చిస్తున్నట్టు చెప్పారు. మొక్కలు నాటడంతోపాటు సెంటర్ డివైడర్లను కూడా అభివృద్ధి చేసేందుకు సంకల్పించామన్నారు. జనావాసాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో గ్రీనరీని పెంపొందించి పచ్చదనం, అహ్లాదకరమైన వాతావరణం కల్పించడం ద్వారాకాకినాడ సుందరీకరణ హరిత నగరాల ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎస్ఈ సత్యకుమారి, ఎంహెచ్వో డాక్టర్ ఫృద్వీచరణ్, డిఈ సుబ్బారావు, ఉద్యాన సహాయసంచాలకులు టి.వి.సిరిల్, కార్పొరేటర్లు గోడి సత్యవతి, నల్లబెల్లి సుజాత, రోకళ్ళ సత్యనారాయణ, కర్రి శైలజ, పాలిక ఉషారాణి, పేర్ల జోగారావు, గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ గద్దేపల్లి దాసు, మాజీకార్పొరేటర్ బొర్రా రమణ, తదితరులు పాల్గొన్నారు.