విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం విశ్వం వాయిస్ న్యూస్:
గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఉమెన్స్ కాలేజీ ఎదురుగా ఉన్న బాలసదనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కలెక్టర్ రాత్రి 9.30 – 10.00 గంటల మధ్య సందర్శించారు. కలెక్టర్ విద్యార్థినులతో మాట్లాడుతూ, బాల సదనంలో వార్డెన్ ఎలా చూసుకుంటున్నారు. రాత్రి సమయంలో కానీ, మిగతా సమయాల్లో కానీ బయటకు పంపు తున్నారా లేదా.. అని అడుగుతూ, మీరు ఇక్కడ ఏమి పనులు చేస్తూ ఉంటారని ప్రశ్నించారు. బాల సదనం పిల్లలు ఇక్కడ ఆయా, వంట మనిషి ఉన్నారని ఏమి పనులు చెప్పారని కలెక్టర్ కి తెలిపారు.
ప్రస్తుతం ఎనిమిది మంది పిల్లలు ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. హాజరు పట్టి, ఇతర రికార్డులను పరిశీలించారు.
ఈ ఆకస్మిక తనిఖీలో ఆర్డీవో చైత్ర వర్షిణి, సూపరింటెండెంట్ రోజా రాణి, తదితరులు ఉన్నారు.