విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:
ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించేందుకు ముందుకు రావాలని ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటలు అందించవచ్చని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు అన్నారు. ఆదివారం ఈదరాడ గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పిఎంఏజేవై పథకంలో మంజూరైన పనిముట్లు ,విత్తనాలను షెడ్యూల్ కులాల సహకార సంఘం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు వాటినీ అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎన్ ఎఫ్ అడిషనల్ డీపీఎం సత్యనారాయణ ఎం.టి జములయ్య , ఎల్ .టు జానకీ, ఐసి ఆర్ పి లు రాధ, మల్లికా తదితరులు పాల్గొన్నారు .