Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు పత్రం చేసింది గోరంత.. చేప్పేది కొండంత..

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం:

: చేసింది గోరంత.. చేప్పేది కొండంత అనేది నానుడి. వైకాపా నాయకుల తీరు దాన్నే మించిపోయింది. ఇల్లు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు చూపిస్తుండటంతో జనాలు అవాక్కవుతున్నారు.

 

వివరాల్లోకి వెళ్తే.. వైకాపా ప్రభుత్వ హయాంలో మీకు ఇంత లబ్ధి చేకూరింది అంటూ వాలంటీర్లతో సీఎం జగన్మోహన్రెడ్డి సంతకంతో ఉన్న సంక్షేమ పత్రాలను పంచుతున్నారు. అవి అందినట్లు వారితో వేలిముద్రలు తీసుకుంటున్నారు. మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో పలువురు మహిళలకు రూ. రెండు లక్షలు విలువైన ఇంటి స్థలం కేటాయించినట్లు చూపించారు.

దీంతో వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసాము కానీ ఇప్పటి వరకు స్థలం ఇవ్వలేదు.. గతేడాది సెప్టెంబర్లో నిర్వహించిన గడపగడపకు కార్యక్రమంలో కూడా ఇలాగే చూపించారని పలువురు వాపోతున్నారు. ఇల్లు ఇవ్వకపోయినా ఇచ్చినట్లు చూపిస్తున్న వైకాపా ప్రచార తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇటువంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement