విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్) రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎంతో మంది విద్యార్థులు బలయోగిపేట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లలో 10 వ తరగతి విద్యను అభ్యసిస్తారు. పరీక్షలు మాత్రం వారికి దూరంలో ఉన్న గోపాలపురం గ్రామంలోని పరీక్షా కేంద్రంలో రాయవలసిన పరిస్థితి. విద్యార్థులు పరీక్షల సమయంలో ఉదయాన్నే లేచి వ్యయప్రయాసలకోర్చి వెళ్లి పరీక్ష రాసి వస్తారు. ఈ పరిస్థితిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామస్థులు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన సంబంధిత మంత్రివర్యులతో మాట్లాడి లేఖలు రాసి ఈ నెల 27 నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షల కొరకు పరీక్షా కేంద్రాన్ని దేవరపల్లిలోనే ఏర్పాటు చేసేలా చొరవతీసుకున్నారు. దీనితో గ్రామస్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డిని సత్కరించారు…