Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 1:36 PM

ACTIVE

India
44,500,353
Total active cases
Updated on March 28, 2024 1:36 PM

DEATHS

India
533,540
Total deaths
Updated on March 28, 2024 1:36 PM
Follow Us

“15 ఏళ్ల కలను సాకారం చేసిన చిర్లను సత్కరించిన గ్రామస్తులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

 

రావులపాలెం(విశ్వం వాయిస్) రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎంతో మంది విద్యార్థులు బలయోగిపేట లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం లలో 10 వ తరగతి విద్యను అభ్యసిస్తారు. పరీక్షలు మాత్రం వారికి దూరంలో ఉన్న గోపాలపురం గ్రామంలోని పరీక్షా కేంద్రంలో రాయవలసిన పరిస్థితి. విద్యార్థులు పరీక్షల సమయంలో ఉదయాన్నే లేచి వ్యయప్రయాసలకోర్చి వెళ్లి పరీక్ష రాసి వస్తారు. ఈ పరిస్థితిని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు గ్రామస్థులు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన సంబంధిత మంత్రివర్యులతో మాట్లాడి లేఖలు రాసి ఈ నెల 27 నుండి జరగనున్న 10వ తరగతి పరీక్షల కొరకు పరీక్షా కేంద్రాన్ని దేవరపల్లిలోనే ఏర్పాటు చేసేలా చొరవతీసుకున్నారు. దీనితో గ్రామస్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డిని సత్కరించారు…

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement