నెస్ట్లే ఇండియా
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ, విశ్వం వాయిస్ః
నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సౌకర్యార్థం నెస్ట్లే ఇండియా సంస్థ పదివేల గ్లౌజ్లను సమకూర్చింది. 4 లక్షల విలువైన ఈ గ్లౌజ్లను స్థానిక కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో గురువారం కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావుకు ఆ సంస్థ ప్రతినిధులు నారాయణన్, వసీమ్ అహ్మద్ అందజేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో పని చేస్తున్న సుమారు 1000 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఈ గ్లౌజ్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు.
ప్రస్తుతం వినియోగించే గ్లౌస్ లు 7 నుంచి 15 రోజులకు ఒకసారి మార్పు చేయాల్సి వస్తుందని, నెస్ట్లే సమకూర్చిన ఈ గ్లౌజులు ఆరు నెలల వరకు
ఉపయోగపడతాయన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా నెస్ట్లే సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని కమిషనర్ ప్రశంసించారు. ఎస్ఈ సత్య కుమారి సంస్థ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.