విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం (విశ్వం వాయిస్)
ఎస్ యానం లో ఉన్న వేదాంత రవ్వ ఆయిల్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విల్లూరి సతీష్ కుటుంబానికి కార్మికులు అండగా నిలిచారు ది రవ్వ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ తరపున సతీష్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించి దాతృత్వం చాటుకున్నారు మృతుని భార్య విజయశ్రీ కు రవ్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దారా ప్రసాద్ జనరల్ సెక్రటరీ ఎస్ సూర్యనారాయణ ఉద్యోగులతో కలసి లక్ష రూపాయల చెక్కును ఆదివారం అందించారు కుటుంబ యజమాని మృతిచెందడంతో ఆ కుటుంబానికి అండగా తోటి కార్మికులు చేయూత నందించడం తో మృతుని కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ఉద్యోగుల సంఘ నాయకులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న కార్మికులకు తోటి కార్మికులు గా ఎల్లప్పుడూ చేయూత అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మోకా సత్య పంతడి కామరాజు పెట్ట ఏడుకొండలు పాలమూరి కాటయ్య తదితరులు పాల్గొన్నారు