Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కన్నబాబు వెంటే బలగం అను నేను

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– బలగం వైకాపా లొనే కొనసాగుతాను… వైసిపి
నాయకుడు అనిశెట్టి,
– మత్స్యకార నాయకులతో మర్యాదపూర్వకంగా కలిశానని వివరణ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

 

కాకినాడ గ్రామీణ, విశ్వం వాయిస్ః

తూరంగి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ వైకాపా పార్టీ గ్రామ ఇంచార్జ్ బలగం ప్రసన్న కుమార్ వైకాపా లోనే కొనసాగుతారని మాజీ మంత్రి రూరల్ శాసనసభ్యులు కన్నబాబు కి వినయ విధేయుడిగానే ఉంటారని బలగం మిత్రుడు తూరంగిశ్వర స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వైసీపీ లీడర్ అనిశెట్టి రామకృష్ణ బలగం ప్రసన్న కుమార్ ను ఉద్దేశించి పత్రికాముఖంగా తెలిపారు. స్థానిక తూరంగి మాజీ సర్పంచ్ వైసీపీ లీడర్ గ్రామ ఇంచార్జ్ మత్స్యకార నాయకుడు బలగం ప్రసన్న కుమార్ నివాసంలో పత్రికా సమావేశం బుధవారం అనిశెట్టి రామకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బలగం మాట్లాడుతూ ఇటీవల కొన్ని పత్రికల్లో నేను పార్టీ మారుతున్నాను.. వేరొక పార్టీలోకి జంప్ అవుతున్నాను అని వచ్చిన వార్త శీర్షికలో వాస్తవం లేదని ఖండించారు. నేను నా మత్స్యకార సామాజిక వర్గం నాయకులతో రాజమండ్రిలో జనసేన నాయకులు చిరంజీవి సోదరుడు నాగబాబును మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందే తప్ప మరి ఏ విధమైన విషయం లేదని ఖండించారు. నేను ఎప్పుడు మాజీ మంత్రి కన్నబాబు వెంటే వైకాపాలో నా ప్రయాణం కొనసాగుతుందని ఒక భక్తుడిగా నేను కన్నబాబు ను ఆరాధిస్తా అన్నారు. రాజకీయంగా నా ఎదుగుదలకు ఆయనే మార్గదర్శి అని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తూరంగి శ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గొల్లపల్లి బాబులు, ఎక్స్ ఎం పి టి సి దాట్ల సార బాబు, రొంగలి వెంకటేశ్వరరావు, మండ సమాధానం , గరికిన అప్పన్న, దండు ప్రోలు సత్యనారాయణ , భద్రం, నరాల నాగేశ్వరరావు సిద్ధాంతి రాజు, శీలం రాఘవ, తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement