విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమండ్రి:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
కేంద్ర సహాయ సామాజిక న్యాయం, సాధికారత మంత్రివర్యులు ఎ. నారాయణస్వామి స్థానికంగా గురువారం
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న నిమిత్తం విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా ఆయన బస చేసిన ( మంజీర హోటల్లో) ల్యాబి లో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె. మాధవిలత మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందచేశారు. కేంద్రసహాయమంత్రికి స్వాగతం పలికిన వారిలో రాజమండ్రీ డివిజన్ ఆర్ డి ఓ ఎ. చైత్ర వర్షిని, జిల్లా షెడ్యూల్డ్ కులాల సంక్షేమం మరియు సాధికారత అధికారి ఎమ్. ఎస్.శోభారాణి, తహశీల్దార్, తదితరులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.