Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పి గన్నవరంలో, ఘనంగా “” ప్రపంచకార్మిక దినోత్సవవేడుకలు””

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

 

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)ప్రపంచ కార్మిక(మేడే)దినోత్సవాన్ని పురస్కరించుకుని పి గన్నవరం గంటరోడ్డులోని కొబ్బరి కార్మికులు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలల అలంకరణ చేసి అనంతరం జెండావిష్కరణ చేసి కేక్ కట్ చేసి కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కార్మికుల కోసం ఎన్నో చట్టాలుచేశారని దానిలో భాగంగా. కార్మికుల సంఘాల ఏర్పాటు చేసుకునే హక్కు.సమ్మె చేసుకునేహక్కు.మహిళా కార్మికులకుప్రసూతి ప్రయోజనాల కొరకు మొదటిసారిచట్టం చేశారని. పధ్నాలుగు గంటల పనిదినాన్ని ఎనిమిదిగంటలకు తగ్గించారని.దేశ కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్.ప్రావిడెంట్ ఫండ్ లాంటి సంక్షేమ హక్కు కల్పించారని.కనీస వేతనంచట్టం చేయడం వెనుక బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఎంతో ఉందన్నారు ఇలాంటి చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచారన్నార ప్రతి కార్మికునికి మాప్రభుత్వం హెల్త్ కార్డులను ప్రవేశ పెట్టిందని ఎక్కడైనా చిన్న ఫ్యాక్టరీపెడితే.దానిలో డెబ్బైశాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రతిపాదన చేసినఘనత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు.పి గన్నవరంలో కార్మికులకు కార్యాలయం ఏర్పాటుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు కార్మికులంతా కలిసుండాలని అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు తోపాటు తెలుగుదేశం నాయకులు కలిసి కేక్.కట్ చేయడం కొసమెరుపు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు. కొక్కిరి రవికుమార్ అడ్డగళ్ళ వెంకటసాయిరామ్.కొబ్బరి కాయలు వ్యాపారస్థులు యడ్లపల్లి మూలాస్వామి.దొమ్మేటి దుర్గారావు సర్పంచ్ సమాఖ్య అధ్యక్షులు తోలేటి బంగారునాయుడు యన్నాబత్తుల ఆనంద్.పితాని నర్సింహారావు. తెలుగుదేశం నాయకులు పులపర్తి రవిబాబు సంసాని పెద్దిరాజు .చేరు శ్రీనుబాబు.నక్కా సత్యనారాయణ.పెచ్చెట్టి ఈశ్వర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement