విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
ముమ్మిడివరం విశ్వం వాయిస్ న్యూస్
ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా ఇవ్వడంలో జగన్ ప్రభుత్వం విఫలమయిందని ముమ్మిడివరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విమర్శించారు. గురువారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం నాకు అర్దాని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో దొరబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ముస్లింలు వారికి పవిత్ర పండుగగా భావించి ఉపవాస దీక్షలు చేసి అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైన సహాయ సహకారాలు అందించక పోవడం జగన్ రెడ్డి నిరంకుశత్వంనకు నిదర్శనం అలాగే హిందువులకు, క్రైస్తవులకు కూడా ఏ విధమైన పండుగ కానుకలు అందించకపోవడం ప్రభుత్వం అలసత్వం అని దొరబాబు అన్నారు గత ప్రభుత్వంలో ముస్లింలకు మక్కా యాత్రకు సదుపాయాలు కల్పించి ఉండేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్, అమలాపురం పార్లమెంటరీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పొద్ధోకు నారాయణ రావు (బాలు), దొమ్మేటి రమణ కుమార్ ,తాడి నరసింహారావు, పిల్లి నాగరాజు ,నగరపంచయతి ఫ్లోర్ లీడర్ ములపర్తి బాలకృష్ణ, నడింపల్లి శ్రీనురాజు , చిక్కాల అంజి బాబు , మిమ్మితీ చిరంజీవి కురశాల శివ,గొల్లపల్లిగోపి ,బొంతు నాగరాజు, కాశి లాజరు ,కాశి రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.