Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on November 30, 2023 12:19 PM

ACTIVE

India
44,468,646
Total active cases
Updated on November 30, 2023 12:19 PM

DEATHS

India
533,298
Total deaths
Updated on November 30, 2023 12:19 PM
Follow Us

చల్లని చలివేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృతిక

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పాత్రియులు పరిన్నీ సేవలు చేయాలి
చలివేంద్రంను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ కృతిక

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:

( విశ్వం వాయిస్ న్యూస్ )
కాకినాడ, మే 4: పాత్రికేయులు ఆదర్శంగా నిలిచి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని కాకినాడ నగరానికి చెందిన పాత్రికేయులు ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శుక్లా, జేసీ ఇలక్కియాలకు కాకినాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎంవి శివరామకృష్ణ , కార్యదర్శి జి శోభన్ బాబులు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.
చలివేంద్రాన్ని ప్రారంభించి కలెక్టర్ శుక్లా మాట్లాడుతూ వివిధ సమస్యల నిమిత్తం పలువురు అర్జీదారులు కలెక్టర్ కార్యాలయానికి వస్తారని వారికి నీరు లేదా మజ్జిగ అందించి సేవ చేయడం మంచి పరిణామమన్నారు. పాత్రికేయులు కలిసి ఈ సేవా కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆమె సూచించారు. పాత్రికేయులు చేస్తున్న సేవలకు తన వంతు సహకారం అందిస్తానని కలెక్టర్ శుక్లా చెప్పారు.
ఈ కార్యక్రమంలో కాకినాడ నగరంతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వివిధ సంస్థలకు చెందిన పాత్రికేయులు హాజరయ్యారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!