Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తీర్చి దిద్దిన జిల్లా కలెక్టర్ ఛాంబర్…

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

బుధవారం ఉదయం శాస్త్రోక్తంగా ప్రారంభం

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:

 

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ ప్రతినిధి న్యూస్:తూర్పుగోదావరి బొమ్మురు లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం లో బుధవారం ఉదయం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ ఛాంబర్ లను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ప్రారంభించారు.
అనంతరం కలెక్టరేట్ పరిధిలో వివిధ కలెక్టరేట్ సెక్షన్ లు ఏర్పాటుకు సంబంధించిన పనులను కలెక్టర్, ఇతర అధికారులు పరిశీలించి తగిన సూచనలు చేశారు.
తొలుత కలెక్టరేట్ కి చేరుకున్న కలెక్టర్ డా. కె. మాధవీలత వేద పండితులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ తో కలిసి కలెక్టర్ ఆధునీకరించి కలెక్టర్ ఛాంబర్ ను ప్రారంభించారు. అనంతరం జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్లని ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్యా రస్తోగి, జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్, డి ఆర్ ఓ బి. సుబ్బారావు, రాజమండ్రి ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఇతర శాఖల అధికారులు కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొని కలెక్టర్ మాధవీలత కు అభినందనలు తెలియజేశారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, దశల వారీగా జిల్లా కలెక్టరేట్ లో వివిధ విభాగాలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే సంబందించిన సెక్షన్స్ అధికారులను, సిబ్బంది విధులకు హాజరు కావడం జరిగిందని తెలిపారు. జిల్లా నూతనంగా ఏర్పాటు చేసినందున వివిధ సెక్షన్స్ కి సంబంధించిన పనులు గత నెలరోజులుగా చేపడుతూనే ప్రజలకు అందుబాటులో ఉండి, పనిచెయ్యడం జరుగుతోందని పేర్కొన్నారు. కలెక్టరేట్ పరిధిలో వివిధ సెక్షన్స్ లో జరుగుతున్న పనులు పూర్తి కావోస్తున్నాయని తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement