Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

22వ మదర్ థెరిస్సా డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మదర్ థెరిస్సా డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నీ ప్రారంభం
– టోర్నీని ప్రారంభించిన అతిథులు ఆకుల వెంకటరామారావు, జకరయ్య
– మొదటి బహుమతి 50,116/- , రెండో బహుమతి 30,116/-

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:

ఎటపాక మండల కేంద్రంలో 22వ మదర్ థెరిస్సా డివిజన్ లెవల్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం డా.పాల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ సి.జకరయ్య మరియు సొసైటీ చైర్మన్ ఆకుల వెంకటరామారావు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి నిర్వాహకులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో ప్రధమ బహుమతి రూ.50,116 నగదును డా.తెల్లం వెంకట్రావు మరియు డా.పాల్ రాజ్ ఇంజనీరింగ్ కళాశాల వారి సహకారంతో సంయుక్తంగా అందజేయటం జరుగుతుందని నిర్వాహక కమిటీ తెలిపారు. ద్వితీయ బహుమతి రూ.30,116 నగదును ప్రముఖ వ్యాపారవేత్త భూక్యా బాల్య సతీమణి భూక్యా భారతి జ్ఞాపకార్థం అందజేయటం జరుగుతుందన్నారు. ఈ క్రికెట్ టోర్నీలో డివిజన్ పరిధిలోని జట్లు తలపడనున్నాయని పేర్కొన్నారు. మొదటిరోజు ప్రారంభించిన మ్యాచ్ లో కరకగూడెం మరియు గణపవరం జట్లు తలపడగా కరకగూడెం జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీసి జట్టు విజయానికి కీలక పాత్ర వహించిన హరీష్ కు మాన్ అఫ్ ది మ్యాచ్ ను మదర్ థెరిస్సా క్రికెట్ క్లబ్ ఫౌండర్ కురినాల వెంకటేశ్వర్లు (బుజ్జి) చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు దాసరి నరేష్ , గజ్జల ఖాసీం , కురినాల నాగేంద్ర , నారాయణ , పసుపులేటి శ్రీకాంత్ , డేగల సురేష్ , పుట్టి సంపత్ , బర్ల లక్ష్మణ్ , సర్వే , విజయ్ , శివ , చందు , సింబా తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement