– అధ్యక్షుడుగా పాయం భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శిగా తెల్లం సత్యనారాయణ
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఎటపాక:
మండల పరిధిలోని పట్టుచీర గ్రామంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి కణితి మధు ఆధ్వర్యంలో ఎటపాక మండల ఆదివాసి సంక్షేమ పరిషత్ నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా పాయం భాస్కర్ రావు , ప్రధాన కార్యదర్శిగా తెల్లం సత్యనారాయణ , ఉపాధ్యక్షులుగా మడకం రాంబాబుతో పాటు మరో 5గురు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కమిటీకి మధు అభినందనలు తెలియజేశారు. ఎన్నికైన నూతన కమిటీ మాట్లడుతూ ఆదివాసీ హక్కులకై పోరాడుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మడివి జోగయ్య , ఇరపా.భద్రయ్య , మడివి బాలరాజు , నాగరాజు , వెంకమ్మ , సావిత్రి , చిన్నబాబు , సొడే.సుమన్ తదితరులు పాల్గొన్నారు.