Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,160,997
Total recovered
Updated on March 24, 2023 5:18 AM

ACTIVE

India
7,605
Total active cases
Updated on March 24, 2023 5:18 AM

DEATHS

India
530,816
Total deaths
Updated on March 24, 2023 5:18 AM

కళలను నెరవేర్చిన కళం”””స్పందన వార్తకు”””కలెక్టర్ స్పందన

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– స్పందనకు వెళ్లాలంటే.. అనే కధనానికి స్పందించిన
కోనసీమ కలెక్టర్
– నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకోనున్న అధికాలు.
– స్వయంగా స్పందన కార్యక్రమానికి రానున్న కలెక్టర్.
– ప్రజల సమస్యలు కలెక్టర్ కి నేరుగా విన్నవించ వచ్చు.
– అర్జీదారుల సమస్యలు పరిస్కారం దిశగా ఇక వేగవంతం.
– రామచంద్రపురం, రెవిన్యూ డివిజల్ కార్యాలయము
నందు స్పందన కార్యక్రమం.
– ప్రజల సమస్యలను పత్రికా ముఖంగా తెలియ జేసిన
– విశ్వం వాయిస్ కధనం.
– విశ్వం వాయిస్ ఎడిటర్ని అభినందిస్తున్న ప్రజలు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

 

రాయవరం( విశ్వం వాయిస్ న్యూస్) 15;- ప్రభుత్వానికి, ప్రజలకు అను సంధంగా ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం మీడియా ప్రత్యేక మైన పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం స్పందన కార్యక్రమం నిర్వహిస్తుంది. అయితే ఇటీవల జిల్లాల విభజనలో భాగంగా కొన్ని మండలాలు, గ్రామాలు జిల్లా ల విభజనతో రూపు రేకలే మారిపోయాయి. అలా మారడం వలన జిల్లా కేంద్రానికి, డివిజన్ కేంద్రానికి ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడం కోసం స్పందన కార్యక్రమానికి వెళ్ళాలి. ఈ నేపథ్యంలో రవాణా మార్గాలు పీఠజల వెళ్ళడానికి అనుకూలంగా లేవు. అసలు బస్ లు కూడా ఆయా డివిజన్ కేంద్రానికి వెళ్ళడానికి అనుకూలంగా లేవు. ప్రభుత్వం బస్ లు ఏర్పాటు కూడా చెయ్యలేక పోయింది. కొన్ని ప్రాంతాల్లో గోదావరి నది దాటి సమస్యలు చెప్పుకోవడం కోసం నా నా ఇబ్బందులు పడుతున్నారు. ఆటువంటి సమయంలో విశ్వం వాయిస్ దిన పత్రికలో స్పందనకు వెళ్లాలంటే…””రవాణా నిల్..సమస్యలు ఫుల్ “” అనే కథనంతో కలెక్టర్ స్పందించారు.

* పత్రికా కథనానికి కలెక్టర్ స్పందించారు.
ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు జిల్లా ఉన్నతాధికారులకు మీడియా ద్వారానే
తెలియా పర్చ గల్గుతారు. పత్రికల ద్వారా ఇలా చేయడంతో ప్రజలు సమస్యలు త్వరిత గతిన పరిష్కరించ బడుతున్నాయి. అయితే నిన్న విశ్వం వాయిస్ దిన పత్రికలో వచ్చిన కథనంతో కలెక్టర్ స్పందించి నేడు స్పందన కార్యక్రమం రామచంద్రపురం, రెవిన్యూ డివిజనల్ కార్యాలయము నందు ఉదయం 10.00 గంటలు నుండి నిర్వహిస్తున్నారు.

* పత్రిక యాజమాన్యానికి అభినందనలు
ప్రజల సమస్యలు నేరుగా అధికారులకు తెలియ జేయగల పత్రికలు ఎన్నో వున్నాయి. అందులో భాగంగా విశ్వం వాయిస్ న్యూస్ కథనం ద్వారా ఒక మంచి పని నేడు కోనసీమ జిల్లాలో జరుగుతున్నది. ప్రజల పాట్లును పత్రిక ద్వారా తెలియ పర్చి నేడు స్పందన కార్యక్రమం నిర్వహించడానికి పత్రిక యాజమాన్యం శ్రమించారు. ఆ యాజమాన్యానికి ప్రజలు అభినందనలు పలువురు తెలియ పరిచారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!