– ఎంపీపీ కారం లక్ష్మ, సర్పంచ్ సరోజిని,
కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, వి.ఆర్.పురం:
వి.అర్.పురం,( విశ్వం వాయిస్ న్యూస్)
19;- మండల పరిధిలోని రేఖపల్లి గ్రామంలోని యస్సి కాలనీ లో ఎర్రిబాబు ఇంటి ఆవరణలో హ్యాండ్ బోరు మరమ్మత్తులు గురైనది. ఈ నేపథ్యంలో మండల జడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి స్పందించి అక్కడి ప్రజల అవసరాలను గ్రహించి తమ జిల్లా పరిషత్ నిధులతో హ్యాండ్ బోరు మరమ్మత్తులు చేయించారు. స్థానిక సర్పంచ్ పూనెం సరోజిని ,, ఎంపీపీ కారం లక్ష్మీ , కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు ఆచంట శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి బుర్రక. కన్నారావు , రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ కార్యదర్శి బొర్రా. నరేష్ కుమార్, టిడిపి సీనియర్ నాయకులు బీరక, సూర్య ప్రకాష్ రావు, ఐ టి డి పి కన్వీనర్ ముత్యాల సిద్దు, సిపిఎం జిల్లా నాయకులు పూనం సత్యనారాయణ, తాతబాబు, కారం సుందరయ్య, ఎయి ( అర్ డబ్లుయ్యస్ ) బుజ్జి బాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.