అంశాలపై సమీక్ష
– 56 లే అవుట్లు లో పనులకై ప్రతిపాదనలు
– జిల్లా కలెక్టర్ డా. కె. మాధవిలత
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం:
రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ః
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా అమలు చేస్తున్న పేదలందరికీ ఇళ్ల నిర్మాణం, లే అవుట్ ల అభివృద్ధి కోసం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ చాంబర్ లో హౌసింగ్ అధికారులు, ఇంజనీరింగ్ లతో సమీక్ష చేశారు. ఈ సందర్భంా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 513 లే అవుట్ల లో పేదలందరికీ ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 56 లే అవుట్లు లో పనులు కై ప్రతిపాదనలు పంపా మన్నారు. ఆరు లే అవుట్ లలో పనులు ప్రారంభం కావలసి ఉందని అధికారులు తెలిపారు.. మూడు లే అవుట్ల లో పునర్ ప్రతిపాదనలు చేశామని, లేవిలింగ్, టెండర్ పనుల ప్రక్రియలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 50 లేఅవుట్లలో అభివృద్ధి సదుపాయాల పనులను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా హౌసింగ్ అధికారి బి. తారా సింగ్, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.