Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,466,078
Total recovered
Updated on September 27, 2023 2:43 AM

ACTIVE

India
557
Total active cases
Updated on September 27, 2023 2:43 AM

DEATHS

India
531,930
Total deaths
Updated on September 27, 2023 2:43 AM

పోలీసు దిగ్బంధంలో అమలాపురం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

పట్టణంలో కి వచ్చే అన్ని దారులు మూసివేత

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

 

అమలాపురం ( విశ్వం వాయిస్ న్యూస్ )

కోనసీమ జిల్లా పేరును అంబేద్కర్ జిల్లాగా మార్చడాన్ని నిరసిస్తూ కోనసీమ జిల్లా సాధన సమితి నిన్నచేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో అమలాపురాన్ని పోలీసులు బుధవారం దిగ్బంధించారు. పట్టణాన్ని పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారుల్లో నిఘాపెట్టి అమలాపురంలోకి ఎవరూ ప్రవేశకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బలగాలను రప్పించి మోహరించారు.అమలాపురం వైపు వచ్చే అన్ని బస్సు సర్వీసులను రద్దు చేయడంతో రోడ్లు అన్ని బోసిపోయాయి. బస్టాండ్లు నిర్మానుష్యమయ్యాయి. అలాగే, మంగళవారం రాత్రి నుండి నిలిపివేసిన సెల్‌ఫోన్ సిగ్నళ్లను ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరించకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకోవైపు, ఆందోళనకారులు పోలీసుల కళ్లుగప్పి పట్టణంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్న సమాచారంతో అన్ని మార్గాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

నిరసనకారులు నేడు రావులపాలెంలో ప్రదర్శనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక బలగాలను అక్కడికి పంపారు. ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు, కాకినాడ ఎస్పీ రవీంద్రబాబు, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, ఎన్టీఆర్ జిల్లా ఎస్పీ సిద్ధార్థ కుషాల్, గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని అమలాపురంలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కోనసీమ వ్యాప్తంగా సెక్షన్ 144, సెక్షన్ 30 అమల్లో ఉందని, ర్యాలీలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు.

 

రౌడీ షీటర్ల ను అదుపులోకి తీసుకున్నాము:

 

రౌడీషీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నామని డీఐజీ పాలరాజు అన్నారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలలో ఉంది అని తెలిపారు.

కోనసీమలో పరిస్థితి అదుపులోనే ఉంది అని అన్నారు.

ఏలూరు డీఐజీ, ఎస్పీలతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితులపై సమీక్షించారు. కోనసీమలో తాజా పరిస్థితిని ఎస్పీలు డీజీపీకి వివరించారు. అమలాపురం అల్లర్ల ఘటనలో ఏడు కేసులు నమోదు చేశామని డీజీపీ తెలిపారు. కలెక్టరేట్‌, మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే సతీష్‌ ఇళ్లకు నిప్పు, 3 బస్సుల దహనంపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పటికే 46 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్టు డీజీపీ తెలిపారు. మరో 72 మంది అరెస్ట్‌కు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో రౌడీషీటర్లందరినీ అదుపులోకి తీసుకున్నామని డీజీపీ వెల్లడించారు. అమలాపురంలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందన్నారు. అల్లర్లను అనుకోకుండా జరిగిన పరిణామంగానే భావిస్తున్నామన్నారు. వాట్సాప్‌ గ్రూప్‌లలో తప్పుడు ప్రచారంతోనే అల్లర్లు జరిగాయన్నారు. అమలాపురంలో 144 సెక్షన్ అమలులో ఉందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.

కోనసీమ జిల్లాలో పరిస్థితిపై డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరా తీశారు. ఏలూరు రేంజ్‌ డీఐజీ, ఎస్పీలతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అమలాపురంలో పరిస్థితిని డీఐజీ, ఎస్సీలు సమీక్షిస్తున్నారు. అమలాపురం ఘటనలో ఏడు కేసులు నమోదు చేశామని…ఇప్పటికే 46 మందిని అరెస్ట్‌ చేశామని డీజీపీ తెలిపారు. రౌడీషీటర్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. 3 బస్సుల దగ్ధంపై నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామన్నారు.కోనసీమలో పరిస్థితి అదుపులోనే ఉంది డీఐజీ పాలరాజు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!